యాప్నగరం

కరుణానిధి వేషంలో టీడీపీ ఎంపీ శివ ప్రసాద్ నిరసన

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన.. కరుణానిధి వేషంలో నిరసన తెలిపిన చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్.

Samayam Telugu 14 Dec 2018, 1:25 pm
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన తెలియజేశారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ శుక్రవారం పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సహా అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
Samayam Telugu siva.


ఇక ఇక విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇవాళ మరో కొత్త గెటప్‌లో కనిపించారు. ఇవాళ కరుణానిధి వేషధారణలో పార్లమెంటుకు వచ్చి నిరసన తెలిపారు. స్నేహధర్మాన్ని పాటించకుండా చంద్రబాబును మోదీ మోసం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.