యాప్నగరం

డ‌ప్పు కొట్టి నిర‌స‌న తెలిపిన ఎంపీ శివ‌ప్ర‌సాద్

ఏపీకీ ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తాజాగా డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు

Samayam Telugu 10 Mar 2018, 10:12 am
ఏపీకీ ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తాజాగా డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. డప్పు చప్పుడుతో దండోరా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర ప్రారంభమైన ఈ కార్యక్రమం చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లనుంది. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మించి మోసం చేసిందన్నారు. విభజన హామీలు నెరవేరుస్తామని మాటిచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్కటీ నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు. ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ ఏమీ లేకుండా బీజేపీ ప్ర‌భుత్వం ఏపీ ప్ర‌జ‌ల‌కు మోసం చేసింద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధించడానికి ప్ర‌జ‌లు నిన‌దించాల‌న్నారు. మోదీ మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని కోరారు.
Samayam Telugu tdp mp siva prasad variety protest over ap special status
డ‌ప్పు కొట్టి నిర‌స‌న తెలిపిన ఎంపీ శివ‌ప్ర‌సాద్



ఏపీ అభివృద్ధి అడుగంటుతోందన్నారు. ప్రజల కోసం పాటుపడే సీఎం చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితి వస్తోందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో చంద్రబాబు పోటీ అవుతారని మోదీ కక్ష గట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడం మన హక్కు అని...ఇందుకోసం ప్రజలంతా ఏకమై సాధించుకుందామంటూ దండోరా వేస్తూ ఎంపీ శివప్రసాద్ పిలుపునిచ్చారు. సంవ‌త్స‌రం రోజు చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వ‌కుండా మోదీ అవ‌మానించార‌ని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.