యాప్నగరం

ఆ మట్టి, నీరు మోదీకే తిరిగిచ్చేస్తా: ఎంపీ శివప్రసాద్

రోజుకో వేషధారణలో పార్లమెంటుకు వచ్చి వినూత్నంగా నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ బుధవారం రైతు వేషంలో వచ్చారు.

TNN 7 Mar 2018, 1:01 pm
ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. రోజుకో వేషధారణలో పార్లమెంటుకు వచ్చి వినూత్నంగా నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ బుధవారం రైతు వేషంలో వచ్చారు. రైతు వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన శివప్రసాద్‌ను ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పలకరించారు. తనకు ఎదురైన ఎంపీలతో మోదీ గారు ఎక్కడుంటారండీ.. అంటూ అమాయకంగా అడుగుతూ నిరసన తెలిపారు. ఓ కుండలో మట్టి, మరో కుండలో నీరు ఉన్న కావడి భుజాన వేసుకుని వచ్చిన ఆయన... రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మట్టి, నీరు ఇచ్చారని.. ఇప్పడవి ఆయనకే తిరిగిచ్చేస్తామని వ్యాఖ్యానించారు.
Samayam Telugu tdp mp sivaprasad turns farmer to stage protest against centre
ఆ మట్టి, నీరు మోదీకే తిరిగిచ్చేస్తా: ఎంపీ శివప్రసాద్


‘నాలుగేళ్ల కిందట అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయలు ప్రకటిస్తామరేమో అని ఆశపడ్డాం. కానీ ఆయన మట్టి, నీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సరేలా మిత్రపక్షంగా ఉన్నాం కదా ఏమైనా మేలు చేయకపోరా? అని ఎదురుచూశాం. కానీ కేంద్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకే ఆయనిచ్చిన మట్టి, నీరు ఆయనకే తిరిగిచ్చేస్తాం. వీటిని స్పీకర్ కు అందించి, ఆమె ద్వారా ప్రధానికి పంపించాలని కోరుతాం... ఒకవేళ ఆయన తీసుకోకపోతే పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెట్టేస్తాం’అని అన్నారు. కావడిని మోస్తూ పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీ శివప్రసాద్‌ను మెట్లు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటివాటిని లోపలకు అనుమతించబోమని నవ్వుతూ చెప్పారు. కాసేపు అక్కడే ఉన్న శివప్రసాద్... చివరకు మెట్లు దిగి, కిందకు వచ్చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.