యాప్నగరం

ఢిల్లీ: పోరాటాన్ని ఉధృతం చేసిన టీడీపీ ఎంపీలు

ఢిల్లీలో కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేశారు టీడీపీ ఎంపీలు. ఎంపీ తోట నర్సింహం ఇంట్లో సమావేశమై... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా చేసిన నేతలు... ఇవాళ శాంతియుత నిరసన తెలపాలని నిర్ణయించారు.

Samayam Telugu 9 Apr 2018, 9:01 am
ఢిల్లీలో కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేశారు టీడీపీ ఎంపీలు. ఎంపీ తోట నర్సింహం ఇంట్లో సమావేశమై... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నా చేసిన నేతలు... ఇవాళ శాంతియుత నిరసన తెలపాలని నిర్ణయించారు. ఎంపీలంతా ప్రత్యేక బస్సులో రాజ్‌ఘాట్‌కు బయల్దేరారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించి... అనంతరం అక్కడే మౌనదీక్ష చేపట్టనున్నారు. శాంతియుత మార్గంలోనే ఆందోళనలు కొనసాగిస్తూ... పరిస్థితిని బట్టి రూట్ మార్చాలని భావిస్తున్నారు.
Samayam Telugu TDP MPS..


ఎంపీలు త్వరలో రాష్ట్రపతిని కూడా కలవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోవింద్‌ను కలిసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతో పాటూ... విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. అలాగే ప్రత్యేక హోదా డిమాండ్‌ను కూడా వినిపించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.