ప్రజాప్రతినిధులమని చూడకుండా ఈడ్చుకెళ్తారా? సుజనా
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట ధర్నాకు దిగిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు
Samayam Telugu 8 Apr 2018, 11:24 am
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట ధర్నాకు దిగిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వారిని తరలించే క్రమంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు ఈడ్చుకెళ్లారు. అలాగే వేంకటేశ్వర స్వామి విగ్రహంతో రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతోన్న ఏలూరు ఎంపీ మాగంటి బాబును సైతం బలవంతంగా లాక్కెళ్లారు. ప్రధాని నివాసం ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా, వారి నిరసనల గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మండిపడ్డారు. తామసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన ఎంపీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తరలించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తామంతా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని, మోదీ సర్కారు ఆదేశాలతోనే పోలీసులు తమపట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించారని ఆరోపించారు. టీడీపీ ఎంపీల అరెస్ట్ తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న సుజనా, రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తక్షణం నెరవేర్చాలన్నదే తమ డిమాండని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోయేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మండిపడ్డారు. తామసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన ఎంపీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తరలించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తామంతా ప్రజా ప్రతినిధులమని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని, మోదీ సర్కారు ఆదేశాలతోనే పోలీసులు తమపట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించారని ఆరోపించారు. టీడీపీ ఎంపీల అరెస్ట్ తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న సుజనా, రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను తక్షణం నెరవేర్చాలన్నదే తమ డిమాండని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోయేది లేదని ఆయన స్పష్టం చేశారు.