యాప్నగరం

ఢిల్లీ: టీడీపీ ఎంపీల ధర్నా.. హిజ్రా వేషంలో ఎంపీ శివప్రసాద్ నిరసన

విభజన హామీల కోసం టీడీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. ఇవాళ కూడా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు. విచిత్ర వేషాలతో నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇవాళ హిజ్రా వేషంలో కనిపించారు.

Samayam Telugu 10 Aug 2018, 1:59 pm
విభజన హామీల కోసం టీడీపీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. ఇవాళ కూడా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు. విచిత్ర వేషాలతో నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇవాళ హిజ్రా వేషంలో కనిపించారు. రోజూ వేషాలు వేసి నిరసన తెలియజేసినా ప్రధాని మనసు కరగలేదన్నారు శివప్రసాద్. అందుకే ఇప్పుడు ఈ వేషం వేయాల్సి వచ్చిందన్నారు. ‘మోదీ బావా.. మాటలెన్నో చెప్పావు.. చేతల్లో ఏమీ చూపించలేదు.. ప్రత్యేక హోదా ఇవ్వవా.. ఇదే అంతం ఆరంభం’ అంటూ చమత్కరించారు. మరోవైపు విచిత్ర వేషాలతో నిరసన తెలుపుతున్న శివప్రసాద్‌ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌లు అభినందించారు.
Samayam Telugu Tdp MP


18 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం కనీసం స్పందించకపోవడం దారుణమని ఎంపీలు మండిపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేస్తే.. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తోందన్నారు. పార్లమెంట్‌లో కూడా అవకాశం వచ్చిన ప్రతిసారీ కేంద్రాన్ని నిలదీస్తున్నామని.. కాని ప్రధాని, కేంద్రమంత్రులు నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. ఇలా నటించే వాళ్లను ఏమీ చేయలేమని.. కేంద్రం ఉలిక్కిపడేలా పిడుగులు పడతాయని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.