యాప్నగరం

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ధర్నా.. అన్నమయ్య వేషంలో శివప్రసాద్

విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నా చేశారు. ప్లకార్డులతో గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు.

Samayam Telugu 23 Jul 2018, 12:14 pm
విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నా చేశారు. ప్లకార్డులతో గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే ఎంపీ శివప్రసాద్ ఇవాళ అన్నమయ్య వేషంలో కనిపించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీల్ని కేంద్రం నెరవేర్చాలని.. ప్రధాని మోదీ మోసం చేశారంటూ.. అదిగో అల్లదిగో అంటూ పాటలు, పద్యాలు అందుకున్నారు.
Samayam Telugu TDP MPS


లోక్‌సభలో అవిశ్వాసంపై 12 గంటల పాటూ చర్చ జరిగినా కేంద్రం, ప్రధాని నుంచి ఏ అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు ఎంపీలు. కేంద్రం దృష్టికి ఎన్నో సమస్యల్ని తీసుకెళ్లామని.. చాలా ప్రశ్నల్ని కూడా లెవనేత్తామని.. అయినా ప్రధాని నాలుగేళ్లగా ఏం చెబుతున్నారో మళ్లీ అదే పాట పాడుతున్నారని విమర్శించారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఇకపైనా పోరాటాన్ని కొనసాగిస్తామంటున్నారు. మరోవైపు లోక్‌సభలో కూడా ఎంపీలు నిరసన తెలిపారు. వారి, వారి స్థానాల్లో నిలబడి ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.