యాప్నగరం

బీజేపీ డైరెక్షన్.. వాళ్లిద్దరి యాక్షన్: టీడీపీ ఎంపీలు

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై జగన్, పవన్‌లో వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, మాగంటి బాబు, మురళీ మోహన్ . సీఎం రమేష్ దీక్ష, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై వారు స్పందించారు.

Samayam Telugu 29 Jun 2018, 2:47 pm
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై జగన్, పవన్‌లో వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, మాగంటి బాబు, మురళీ మోహన్ . సీఎం రమేష్ దీక్ష, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై వారు స్పందించారు. స్టీల్ ప్లాంట్‌పై జగన్, పవన్‌లు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు ఎంపీలు. కుట్రలు చేయడానికే వారికి సమయం సరిపోతుందని.. ప్రజా సమస్యలు పట్టవని మండిపడ్డారు. వైసీపీ, జనసేనలు బీజేపీకి పెయిడ్ కన్సల్టెంట్స్‌లా మారిపోయాయని.. మోదీ, అమిత్ షా డైరెక్షన్‌లో జగన్, పవన్ నటిస్తున్నారని విమర్శించారు.
Samayam Telugu MPS


పాదయాత్ర చేస్తున్న జగన్.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడూ మాట్లాడలేదని.. ఆయనకు సీఎం కుర్చీపై మాత్రమే ఆరాటమన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే.. ఆయన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో కూడా రాష్ట్రానికి కంపెనీలు రాకుండా అడ్డుపడిన చరిత్ర వైసీపీకి ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై కూడా ఎంపీ మురళీ మోహన్ స్పందించారు. ఆ వీడియోను కొంతమంది తమకు అనుకూలంగా మార్ఫింగ్‌ చేశారని ఆరోపించారు. ఇదంతా కేవలం కొన్ని మీడియాల సృష్టేనని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.