యాప్నగరం

BJPలో విలీనం చేయండి.. వెంకయ్యను కోరిన టీడీపీ ఎంపీలు

టీడీపీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిశారు. తమను బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ లేఖను ఆయనకు అందజేశారు. ఎంపీలతోపాటు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, జేపీ నడ్డా వెంకయ్యను కలిశారు.

Samayam Telugu 20 Jun 2019, 5:58 pm
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా బలపడాలని చూస్తోన్న బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ను మొదలుపెట్టింది. టీడీపీ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమవైపు తిప్పుకుంటోంది. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ రావులు టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారు. గరికపాటి మినహా మిగతా ముగ్గురు ఎంపీలు.. ఢిల్లీలోని వెంకయ్య నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. కిషన్ రెడ్డి, జేపీ నడ్డాలతో కలిసి ఉప రాష్ట్రపతి నివాసానికి వెళ్లిన వారు తమను బీజేపీలో విలీనం చేయాలని వెంకయ్యకు ఓ తీర్మానాన్ని అందజేశారు.
Samayam Telugu venkaiah with tdp mps


తాము బీజేపీలో చేరబోతున్నామని ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. వీరు నలుగురు బీజేపీలో చేరితే రాజ్యసభలో ఎన్డీయే బలం 103కు చేరనుంది. అదే సమయంలో టీడీపీకి ఇద్దరు మాత్రమే రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేసిందేమీ లేదని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. త్వరలోనే బీజేపీలోకి భారీ చేరికలు ఉంటాయని కమలం పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. వారసత్వం నుంచి, బానిసత్వం నుంచి టీడీపీ నేతలు బయటపడాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
చదవండి: బీజేపీలో చేరుతున్నాం.. బాబుకు చెప్పాం: టీజీ, సుజనా
మరోవైపు టీడీపీకి చెందిన దాదాపు 20 మంది కాపు నేతలు కాకినాడలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.