యాప్నగరం

చేతగాని నేత జగన్: యామిని సాదినేని

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని ఘాటు విమర్శలు చేశారు. అవినీతిపై నీతి గెలుస్తుందంటూ జగన్ అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 11 Mar 2019, 10:58 pm
డ్రామాలాడటంలో వైసీపీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌ను మించిన వారెవరూ లేరని టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని అన్నారు. ఏప్రిల్‌ 11న ఓటు వేసిన మరుసటి రోజే కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి జగన్‌ది అని ఆమె ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి అవినీతిపై నీతి గెలుస్తుందంటూ హాస్యాస్పదంగా ఉందన్నారు. కాకినాడలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావ సభలో సీఎం చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై యామిని తీవ్రంగా స్పందించారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu Yamini


అవినీతి, మనీ లాండరింగ్‌ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైఎస్ జగన్‌ను ఏపీ ప్రజలు నమ్మరని యామిని అన్నారు. డేటా చోరీ, ఫారం-7, కోడికత్తి లాంటి డ్రామాలాడటంలో ఆయణ్ని మించిన వారెవరూ లేరని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి 5 కోట్ల మంది ప్రజల కలల సౌధమని.. అలాంటి రాజధాని నగరం అమరావతిని భ్రమరావతి అంటూ హేళన చేస్తున్నారని జగన్‌పై యామిని మండిపడ్డారు. ఐదేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చని చేతగాని నేత జగన్‌ అని ఆమె మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను భ్రష్టు పట్టించే నాయకుడు ఎవరైనా ఉంటే అది జగనేనంటూ ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆయనకు చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతారని అన్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.