యాప్నగరం

మేడిన్ ఏపీ.. కేసీఆర్ ఇప్పుడేం మాట్లాడతారు: యామిని సాదినేని

గోడలకు కన్నాలు, సున్నాలు వేసుకునే నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని అన్నారు. పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Samayam Telugu 29 Jan 2019, 6:51 pm
పీలో కియా కార్ల తయారీతో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని అన్నారు. మేడిన్ జర్మనీ, మేడిన్ జపాన్ మాదిరిగా ఇకపై ‘మేడిన్ ఏపీ’ అనే నినాదం రానుందని ఆమె చెప్పారు. అనంతపురంలో సీఎం చంద్రబాబు మంగళవారం (జనవరి 29) ఉదయం ‘కియా మోటార్స్’ ఏపీ ప్లాంట్‌లో రూపొందించిన తొలి కారును ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో యామిని మీడియాతో మాట్లాడుతూ.. మేడిన్ ఇండియా అంటూ ప్రధాని మోదీ తిరిగిన దేశాలెన్ని? ఎన్ని కంపెనీలు తెచ్చారని ప్రశ్నించారు.
Samayam Telugu Yamini sadineni


రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా వాళ్లు కర్రీ పాయింట్లు పెట్టుకోవాలని ఎద్దేవా చేసిన కేసీఆర్.. ఇప్పుడేం మాట్లాడతారని యామిని ప్రశ్నించారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే రాయలసీమ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాయలసీమలో పుట్టి పెరిగిన జగన్... సీమకు ఏం చేస్తారో ఎప్పుడైనా చెప్పగలిగారా అని ఆమె ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా యామిని సాదినేని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమరావతిని స్వాధీనం చేసుకుంటామని, సహజ వనరులు కొల్లగొడుతున్నారని ఓ నేత ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఘనతే అని చెప్పుకునేందుకు బీజేపీ నేతలు నానా తంటాలు పడుతున్నారని యామిని ఎద్దేవా చేశారు. గోడలకు కన్నాలు, సున్నాలు వేసుకునే నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.