యాప్నగరం

​నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థెవరంటే...

ఎలా ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనే అంశంపై ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయని సమాచారం.

TNN 15 Mar 2017, 8:33 am
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికపై అప్పుడే చర్చ మొదలైంది. ఖాళీ అయిన ఈ స్థానాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే పార్టీలు మాత్రం ఈ ఉప ఎన్నిక విషయంలో చాలా వేగంగా స్పందిస్తున్నాయని తెలుస్తోంది. ఎవరిని బరిలో దించాలి? ఎలా ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలనే అంశంపై ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయని సమాచారం.
Samayam Telugu tdp to contest nandhyal bypoll
​నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థెవరంటే...


తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పటికే అభ్యర్థి కూడా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి స్థానంలో ఆయన చిన్న కూతురుని ఎన్నికల రణరంగంలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. భూమా పెద్ద కూతురు ఇప్పటికే ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తల్లి శోభ మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. ఆళ్లగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి మరణంతో భూమా మౌనిక రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది.

భూమా మౌనిక విదేశాల్లో విద్యనభ్యసించారు. జర్నలిజానికి సంబంధించిన డిగ్రీ పూర్తి చేశారు. సొంతంగా మీడియా సంస్థను నెలకొల్పాలనే లక్ష్యం ఉన్నట్టుగా కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు తండ్రి హఠాన్మరణంతో ప్రత్యక్ష రాజకీయాల వైపు వస్తున్నట్టున్నారు. సానుభూతి నేపథ్యంలో మౌనికను బరిలోకి దించి.. ఏకగ్రీవం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే ఈ నియోజకవర్గం తమది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏకగ్రీవంగా తాము నిలిపిన అభ్యర్థే గెలవాలని వైకాపా అంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.