యాప్నగరం

ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: జైట్లీ

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకీ తగిన కేటాయింపులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీనీ బుజ్జగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

TNN 4 Feb 2018, 2:02 pm
కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ ప్రజాప్రతినిధుల్లో రగులుతున్న అసంతృప్తిని నియంత్రించేందుకు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగారు. ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం వైదొలిగే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. మిత్రపక్షం టీడీపీతో ఎలాంటి సమస్యలున్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బడ్జెట్‌తో సంబంధం లేదు. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పునర్విభజన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.
Samayam Telugu tdp unhappy over raw deal to andhra pradesh in union budget
ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: జైట్లీ


మరోవైపు తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశాన్ని సీరియస్‌గా తీసుకున్నభాజపా నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, బడ్జెట్ అంశాలపై చర్చించారు. అమిత్‌షాతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌‌కు అన్యాయం జరిగిందని.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. మరోపై సీఎం చంద్రబాబు కూడా తీవ్రఅసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు చంద్రబాబు ఆదివారం (ఫిబ్రవరి 4) విజయవాడలో పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.