యాప్నగరం

టీడీపీ వర్సెస్ బీజేపీ, దీక్ష రచ్చ!

మొన్నటి వరకూ మిత్రపక్షాలుగానే ఉండిన టీడీపీ, బీజేపీల మధ్య ఇప్పుడు రచ్చ రాజుకుంది.

Samayam Telugu 12 Apr 2018, 12:02 pm
మొన్నటి వరకూ మిత్రపక్షాలుగానే ఉండిన టీడీపీ, బీజేపీల మధ్య ఇప్పుడు రచ్చ రాజుకుంది. ఇప్పటికే ప్రత్యేకహోదా, ఏపీకి నిధుల కేటాయింపు అంశంపై టీడీపీ, బీజేపీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీని మోడీ మోసం చేశారు.. అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటుంటే, మొన్నటి వరకూ హోదా వద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా ఎలా అడుగుతున్నారు? అని కమలనాథులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ ఇరు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి.
Samayam Telugu TDP-BJP


ఆ సంగతలా ఉంటే.. నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు చేపట్టిన ఒక రోజు దీక్ష విషయంలో కూడా టీడీపీ, బీజేపీల మధ్య విబేధాలు పొడసూపుతున్నాయి. లోక్‌సభ లో ప్రతిపక్షాల తీరును తప్పు పడుతూ ప్రధాని మోడీ ఈ దీక్షకు పిలుపునిచ్చారు. తను ఒక రోజు ఉపవాస దీక్షను చేస్తానని మోడీ ప్రకటించారు. ఆ మేరకు బీజేపీ ఎంపీలంతా ఈ దీక్షలో భాగస్వామ్యులవుతున్నారు.

ఇందులో భాగంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా దీక్షను చేపట్టారు. అయితే ఆయన దీక్షకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదని తెలుస్తోంది. విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ఉపవాస దీక్ష కోసం తను మూడు రోజుల కిందట అనుమతి చేసుకున్నాను అని, అయితే తనకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదని ఆయన అన్నారు. తన దీక్షకు అనుమతిని ఇవ్వకుండా, అదే చోట సీపీఐ చేపట్టిన వేరే దీక్షకు మాత్రం ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని జీవీఎల్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టారు. అయితే జీవీఎల్ దీక్షకు విజయవాడలోనే ధర్నా చౌక్ వద్ద అనుమతిని ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.