యాప్నగరం

​అభ్యర్థులపై స్పష్టత.. ఆసక్తికరంగా మారిన నంద్యాల పోరు!

భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యం అయిన నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఇప్పుడిప్పుడు స్పష్టత వస్తోంది.

TNN 13 Jun 2017, 10:40 am
భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యం అయిన నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఇప్పుడిప్పుడు స్పష్టత వస్తోంది. ఇక్కడ పోటీకి అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా రెడీ అయినట్టే. తను వైకాపాలో చేరనున్నానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించడంతో పాటు, ఆ పార్టీ తరపున నంద్యాల బై ఎలక్షన్స్ లో పోటీ చేస్తానని కూడా తెలిపారు. దీంతో వైకాపా తరపున అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది.
Samayam Telugu tdp ysrcp get ready for nandyal bypoll
​అభ్యర్థులపై స్పష్టత.. ఆసక్తికరంగా మారిన నంద్యాల పోరు!


ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టే. భూమా అన్న కుమారుడు అయిన బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయనున్నట్టుగా చాన్నాళ్ల నుంచినే వార్తలు వస్తున్నాయి. మంత్రి అఖిల ప్రియ ఇప్పటికే నియోజకవర్గంలో అన్న తరపున ప్రచారం ప్రారంభించారు కూడా. నంద్యాల నియోజకవర్గాన్ని పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తానని అంటూ ఆమె జనాల్లోకి వెళ్తున్నారు.

ఎక్కువ లేట్ చేయకుండా, శిల్పా మోహన్ రెడ్డి రేపే వైకాపాలో చేరనున్నారు. ఉప ఎన్నికల్లో ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తాడని ప్రకటించడం కూడా లాంఛనమే. ఈ విధంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున అభ్యర్థులు రణరంగంలోకి దిగుతున్నారు. భూమా మరణించి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. మరో మూడు నెలల వ్యవధిలోపే నంద్యాలకు మరో ఎమ్మెల్యే ఎన్నికవ్వాల్సి ఉంది. ఈసీ అతి త్వరలోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను జారీ చేసే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.