యాప్నగరం

టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లాలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నీటి కోసం తలెత్తిన వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది.

Samayam Telugu 25 May 2019, 8:03 pm
ఏపీలో అధికార మార్పిడి జరుగుతున్న వేళ... టీడీపీ, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు దిగాయి. చేతికి అందిన వాటితో కొట్టుకున్నారు. మహిళలు సైతం ఈ ఘర్షణలో పాల్గొన్నారు.
Samayam Telugu tdp ysrcp fight


పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించిన వారు.. గ్రామంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మంచినీళ్ల విషయంలో తలెత్తిన వివాదం.. ఒకరిపై మరొకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లిందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.