యాప్నగరం

టీచర్‌ను తరగతి గది నుంచి బయటికి పిలిచి...

ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులంతా చూస్తుండగానే హత్యకు గురైంది.

TNN 21 Apr 2017, 8:53 am
ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులంతా చూస్తుండగానే హత్యకు గురైంది. ఆమెను చంపింది కూడా మరొక టీచర్ అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని మబ్బువాళ్లపేటలోని ఎలిమెంట్రీ స్కూల్ లో ప్రేమకుమారి (38) టీచర్ గా పనిచేస్తోంది. గురువారం తరగతిలో గదిలో పిల్లలకు పాఠాలు చెబుతుండగా ఉదయం 11.30 ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చాడు. తరగతి గదిలో ఉన్న ప్రేమకుమారిని బయటికి పిలిచాడు. వెంటనే తన దగ్గరున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. హంతకుడు అక్కణ్నించి పరిగెట్టుకుని వెళ్లి గోడదూరి పరారయ్యాడు. ఇదంతా చూసిన చిన్న పిల్లలు భయంతో అరుచుకుంటూ ఇళ్లకు పరుగులు పెట్టారు. విషయం తమ అమ్మానాన్నలకు చెప్పడంతో గ్రామస్థులంతా స్కూల్ కి వచ్చారు. అప్పటికి ప్రేమకుమారి కొనఊపిరితో ఉండడంతో ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె మరణించింది.
Samayam Telugu teacher killed in school in front of students in chittoor
టీచర్‌ను తరగతి గది నుంచి బయటికి పిలిచి...


అయితే ఆమెను ఎందుకు హత్య చేశారన్నది ఇంకా పోలీసులు ప్రాథమిక అంచనాలకు రాలేకపోయారు. గంగవరం పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి అనే వ్యక్తి హత్య చేసినట్టు ప్రేమ తండ్రి అర్జునయ్య చెబుతున్నారు. అతను గతంలో కూడా ప్రేమకుమారితో గొడవపడ్డాడని, అతనిపై పోలీసు కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. అతని అనుమానాన్ని పెంచేలా చంద్రమౌళి కూడా కనిపించకుండా పోయాడు. అతని ఇంటికి వెళ్లగా ఆచూకీ తెలియదనే సమాధానం వచ్చింది. చంద్రమౌళి దొరికితే కేసు చిక్కుముడి విడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.