యాప్నగరం

తారుమారైన అభ్యర్థుల పేర్లు.. పోలింగ్ రద్దు

బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు తారుమారు కావడంతో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్ ను ఎన్నికల

Samayam Telugu 9 Mar 2017, 6:43 pm
బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు తారుమారు కావడంతో రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్ ను ఎన్నికల సంఘం రద్దు చేసింది. గురువారం జరిగిన ఈ ఎన్నికలో..వికారాబాద్ లోని పోలింగ్ బూత్ లో ఉన్న బ్యాలెట్ పత్రంలో మూడో నంబర్లో ఉన్న టీఎస్ యూటీఎణ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి...తొమ్మిదో నెంబర్లో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మయ్యల ఫొటోలు తారుమారయ్యాయి. దీంతో పోలింగ్ ను రద్దు చేయాలని మాణిక్ రెడ్డి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాలు దృష్టికి తీసుకొచ్చారు.
Samayam Telugu teachers graduates constituency mlc polling cancels postponed in telangana
తారుమారైన అభ్యర్థుల పేర్లు.. పోలింగ్ రద్దు


బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు, ఫొటోలు తారుమారైన సంగతిని నిర్ధారించాక..విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో ఎన్నికల సంఘం ఆ పోలింగ్ ను రద్దు చేసి ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.