తెలంగాణలో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం ఆయన వరంగల్లోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ. 20 కోట్లు మంజూరు చేసామని చెప్పారు. ఈ నిధులతో రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఆరు నెలల లోపు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు కడియం వివరించారు.
10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాను విద్యా రంగంలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక పాఠశాలలు, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, జూనియర్, డిగ్రీ కాలేజీలలో కనీస మౌళిక వసతుల కల్పన 2017 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.
10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లాను విద్యా రంగంలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక పాఠశాలలు, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, జూనియర్, డిగ్రీ కాలేజీలలో కనీస మౌళిక వసతుల కల్పన 2017 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.