యాప్నగరం

జగన్‌పై దాడి.. కోహ్లీ సేనకు తప్పని నిరీక్షణ

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొనే సమయంలో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థతి నెలకొనడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోకి బయటి వ్యక్తులను ఆ సమయంలో అనుమతించలేదు.

Samayam Telugu 25 Oct 2018, 7:02 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లోని వెయిటర్‌గా పనిచేస్తోన్న శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి అని వెళ్లి జగన్‌పై కోడిపందేల కత్తెతో దాడి చేశాడు. ఈ దాడితో విమానాశ్రయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ ఘటన ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించి విమానంలో హైదరాబాద్‌కు పంపేశారు.
Samayam Telugu Kohli


అయితే, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొనే సమయంలో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థతి నెలకొనడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోకి బయటి వ్యక్తులను ఆ సమయంలో అనుమతించలేదు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు రెండు బస్సుల్లో విమానాశ్రయం వద్దకు చేరుకుంది. విమానశ్రయం లోపల ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భద్రతా సిబ్బంది ఎవరినీ లోపలికి పంపలేదు. అలాగే వాహనాలను విమాశ్రయానికి కాస్త దూరంగా ఆపేశారు. ఈ వాహనాల మధ్యలో టీమిండియా బస్సులు కూడా ఉన్నాయి. దీంతో కోహ్లీ సేనకు కాసేపు నిరీక్షణ తప్పలేదు.
బుధవారం వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడిన భారత్.. ఆ మ్యాచ్‌ను టై చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డే ఆడేందుకు భారత జట్టు పుణే వెళ్లాల్సి ఉంది. ఈనెల 27న వెస్టిండీస్, భారత్ మధ్య మూడో వన్డే జరుగుతుంది. అందుకే గురువారం విశాఖపట్నం నుంచి నేరుగా భారత జట్టు పుణేకు బయలుదేరింది. హోటల్ నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన జట్టు విమానాశ్రయం వద్దకు వచ్చే సరికి లోపల జగన్‌పై దాడి జరిగింది. దీంతో ఈ రెండు బస్సులు కాసేపు బయటే ఆగిపోయాయి. విమాశ్రయంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరవాత భారత ఆటగాళ్లను లోపలికి పంపారు. అక్కడి నుంచి విమానంలో టీమిండియా పుణే బయలుదేరి వెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.