యాప్నగరం

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి.. జలపాతం వద్ద విషాదం

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ తెలుగువ్యక్తి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. కుటుంబంతో కలిసి హాలీ డే ట్రిప్‌కు వెళ్లగా ఈ విషాదం చోటుచేసుకుంది.

Samayam Telugu 6 Jul 2019, 10:17 pm
మెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సమేతంగా హాలిడే ట్రిప్ కోసం వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి దుర్మరణం పాలైన ఘటన డల్లాస్‌లో చోటుచేసుకుంది. డల్లాస్‌లో సింతెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నూనె సురేశ్.. భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే స్థిరపడ్డారు. కుటుంబ సమేతంగా ఆయన ఒక్లహోమాలోని టర్నర్ జలపాతం చూడటానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ జలపాతంలో కొట్టుకుపోయారు.
Samayam Telugu Suresh


సురేశ్ మృతితో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహానికి స్వస్థలంలో అంత్యక్రియలు జరపాలని తల్లిదండ్రులు, బంధువులు భావిస్తున్నారు. కానీ, మృతదేహం తరలింపుకు భారీ వ్యయం కానుండటంతో ఆందోళన చెందుతున్నారు.

రెస్క్యూ టీం జలపాతం నుంచి సురేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. డెడ్ బాడీ తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం అవుతాయని అంచనా. కుటుంబసభ్యులు, బంధువుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే కొంత మంది తమకు తోచిన సహాయం అందించారు.

అమెరికాలో తెలుగు సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వీలైనంత త్వరగా సురేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

సురేశ్ కుటుంబ సభ్యులకు సాయం చేయాలనుకుంటే...
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: +14699845145, +17653574746

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.