పుల్వామా ఉగ్రదాడిపై భారతావని భగ్గుమంటోంది. ముష్కర మూకల చేతిలో బలైన జవాన్లకు నివాళిగా.. దేశవ్యాప్తంగా కుల, మతాలకు అతీతంగా అందరూ జాతీయ జెండాను చేతపట్టి ర్యాలీలు చేస్తున్నారు. హైదరాబాద్లో మాత్రం ఓ 17ఏళ్ల కుర్రాడు జాతీయ జెండాను తీవ్రంగా అవమానించడం కలకలంరేపింది. త్రివర్ణ పతకాన్ని రోడ్డుపై వేసి కాలితో తొక్కడం సంచలనంగా మారింది. శనివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులో యువకుడు జెండాను తొక్కడం చూసిన స్థానికులు.. అతడ్ని పట్టుకొని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. అతడి గురించి ఆరా తీయగా.. మతిస్థిమితం లేదని తేలింది. కుర్రాడు చింతల బస్తీకి చెందిన జేషన్గా గుర్తించారు. మూడు నెలలుగా అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ చూపించడంతో వారికి అప్పగించారు.
హైదరాబాద్: త్రివర్ణ పతాకానికి అవమానం.. 17ఏళ్ల కుర్రాడి అరెస్ట్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో రోడ్డుపై జాతీయ జెండాను పడేసి కాలితో తొక్కిన కుర్రాడు.. పట్టుకొని చితకబాదిన స్థానికులు. యువకుడి అలా చేయడానకి కారణం తెలుసుకొని షాక్ తిన్న పోలీసులు.
Samayam Telugu 17 Feb 2019, 4:49 pm
ప్రధానాంశాలు:
- ఆ కుర్రాడు చింతల్ బస్తీకి చెందినవాడిగా గుర్తింపు
- మూడు నెలలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు
- డాక్టర్ సర్టిఫికేట్ చూపించడంతో వదిలేశారు