యాప్నగరం

నిరసనల మధ్యే ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లు

భూసేకరణ చట్ట సవరణ బిల్లుకి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కేంద్రం భూసేకరణ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం...

Samayam Telugu 30 Apr 2017, 11:35 am
భూసేకరణ చట్ట సవరణ బిల్లుకి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కేంద్రం భూసేకరణ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశం ప్రారంభమైన తొలి ఏడు, ఎనిమిది నిమిషాల్లోనే కాంగ్రెస్ పార్టీ సభ్యుల నినాదాల మధ్యే సభ ఈ బిల్లుకు ఆమోదిందింది.
Samayam Telugu telangana assembly passes amendments to central land acquisition bill
నిరసనల మధ్యే ఆమోదం పొందిన భూసేకరణ చట్ట సవరణ బిల్లు


సభ ప్రారంభమైన వెంటనే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకన్నా ముందుగా మిర్చి రైతుల సమస్యలపై చర్చ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. అయితే, బీఏసీ సమావేశంలో చర్చించిన ప్రత్యేకమైన అంశాలపైనే సభా సమావేశాలు జరుగుతాయని స్పీకర్ సభ్యులకి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు పట్టువీడలేదు. కాంగ్రెస్ సభ్యులని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రపతి సూచనల మేరకు సభలో ప్రవేశపెడుతున్న బిల్లు కనుక కేవలం బిల్లుపైనే మాట్లాడాల్సిందిగా స్పీకర్ మధుసూదనా చారి కోరారు.

అయితే, ఎంతకీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో తమ ఆందోళనను విరమించకపోవడంతో ఇక చేసేదేం లేదన్నట్టుగా వారి నినాదాల మధ్యనే బిల్లుపై చర్చ చేపట్టకుండానే హడావుడిగా భూసేకరణ చట్ట సవరణలు 2013 బిల్లుకి సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.