మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను భవిష్యత్లో ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకుంటాయని తెలిపారు. అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేద్దామని కోరారు. మిషన్ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయని పంతాలకు, పట్టింపులకు వెళ్లకుండా ప్రతిపక్షం ఇచ్చిన ప్రతి సూచనను సీఎం స్వీకరిస్తున్నారని ఆయన తెలిపారు.
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను భవిష్యత్లో ఇతర రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకుంటాయని మంత్రి హరీశ్రావు తెలిపారు
TNN 29 Mar 2016, 12:35 pm