యాప్నగరం

అనూహ్యం.. నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ!

అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎన్ని రోజులైనా సభను నడుపుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

TNN 17 Nov 2017, 11:50 am
అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎన్ని రోజులైనా సభను నడుపుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 50 రోజుల పాటు సుదీర్ఘంగా సాగుతుందని భావించిన అసెంబ్లీ సమావేశాలను నేటితో అర్థాంతరంగా ముగించాలని తెరాసా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రోజులపాటు సభ నిర్వహించాల్సిన అవసరం లేదని, చర్చించాల్సిన అంశాలు కూడా ఏమీ లేవని శాసనసభా పక్ష నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం జరిగిన బీఏసీ సమావేశంలో అన్ని పార్టీల నేతలతో భేటీ అయిన ఆయన, చర్చించాల్సిన అంశాల లేవని చెబుతూ, సభను ముగిద్దామని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనలకు కాంగ్రెస్, బీజేపీలు అంగీకారం తెలిపాయి. అయితే, ఎస్సీల సంక్షేమంపై చర్చిద్దామని, అందుకు సమయాన్ని కేటాయించాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు హరీశ్ అంగీకరించారు.
Samayam Telugu telangana assembly sessions may ending today
అనూహ్యం.. నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ!


ఈ అంశంపై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అక్టోబరు 27 న ప్రారంభమైన శీతాకాల సమావేశాలను తెలంగాణ సర్కారు కేవలం ఇరవై రోజుల్లోనే ముగించేస్తోంది. మరోవైపు బీసీలు, అనేక కులాల్లో దళితులు, గిరిజనుల కంటే కడుపేదవాళ్లు చాలా మంది ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తారల సందర్భంగా వెనుకబడిన తరగుల సంక్షేమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అన్ని కులాలో కూడా కడుపేదలు ఉన్నారని, వాళ్ల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి గత ప్రభుత్వాలు చేయలేనన్ని పథకాలను అమలు చేస్తున్నామని, ఏ జిల్లాలో అన్యాయం జరిగిందో చెప్పాలని, చెబితే వారిపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.