యాప్నగరం

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి.

TNN 27 Mar 2017, 3:24 pm
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం.. సభను నిరవధికంగా (సైన్‌డై) వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ రోజు (మార్చి 27) అసెంబ్లీ ప్రారంభమవగానే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. సభలో ‘ద్రవ్య వినిమయ బిల్లు’, ‘కాగ్ రిపోర్టు’ను ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. చాలాసేపు ప్రసంగించారు.
Samayam Telugu telangana assembly sine die
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా


బీసీల రిజర్వేషన్లు తదితర అంశాలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. మెస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించి వసతి గృహాల విద్యార్థులకు తీపి కబురు అందించారు. హోంగార్డులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని, ఆశా వర్కర్లకు కూడా త్వరలోనే వేతనాలు పెంచుతామని ఆయన తెలిపారు. అనంతరం ‘ద్రవ్య వినిమయ బిల్లు’కు సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత స్పీకర్ సభను నిరధివకంగా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని గమనిస్తే.. రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ అసెంబ్లీ త్వరలోనే ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.