యాప్నగరం

ఎమ్మెల్యేలకు ఆ అధికారం లేదు: కేసీఆర్

డబుల్ బెడ్‌రూం పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యేలకు లేదని, కేవలం అధికారులు మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు.

TNN 27 Dec 2016, 3:36 pm
డబుల్ బెడ్‌రూం పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యేలకు లేదని, కేవలం అధికారులు మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు. మంగళవారం అసెంబ్లీలో డబుల్ బెడ్‌రూం పథకంపై జరిగిన చర్చలో కేసీఆర్ మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికను జిల్లా కలెక్టర్లకు అప్పగించామని, ఈ ఎంపిక చాలా పారదర్శకంగా జరుగుతుందని సీఎం చెప్పారు.
Samayam Telugu telangana assembly winter session discussion on double bedroom scheme
ఎమ్మెల్యేలకు ఆ అధికారం లేదు: కేసీఆర్


ఎమ్మెల్యేలకు గ్రామాలను ఎంపిక చేసే అధికారం మాత్రమే ఉంటుందని సీఎం వెల్లడించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యమైన మాట వాస్తవమని, దీనికి తాను అంగీకరిస్తున్నాని కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నామని, కొంచెం ఆలస్యం అయినంత మాత్రాన ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణానికి 650 ఎకరాలు సేకరించామని సీఎం చెప్పారు. 15 లక్షల మంది లబ్ధిదారుల దరఖాస్తులు తిరస్కరించామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసారు. గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ల నిర్మాణాలు గందరగోళంగా జరిగాయని, అధికారులు, నాయకులు అవకతవకలకు పాల్పడి లబ్ధిపొందారని సీఎం ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు పథకంలో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణను వేగవంతం చేసామని కేసీఆర్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.