యాప్నగరం

27 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

శాసనసభ, మండలి సమావేశాలను అక్టోబర్ 27 నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే అసెంబ్లీ కార్యదర్శికి అధికారులు ప్రతిపాదనలను పంపారు.

TNN 17 Oct 2017, 7:55 pm
శాసనసభ, మండలి సమావేశాలను అక్టోబర్ 27 నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే అసెంబ్లీ కార్యదర్శికి అధికారులు ప్రతిపాదనలను పంపారు. సభ నిర్వహణకు సంబంధించి 26న బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులతో దీనిపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
Samayam Telugu telangana assembly winter session from oct 27
27 నుంచి అసెంబ్లీ సమావేశాలు..


ఈ సందర్భంగా శాసనసభలో చర్చ జరిగిన ప్రతి అంశంపై మండలిలోనూ చర్చ జరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రతిపక్షాలు ఏ అంశంపై ప్రశ్నలు లేవనెత్తినా.. సమాధానం చెప్పడానికి సర్వసిద్ధంగా ఉండాలని మంత్రులకు కేసీఆర్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.