యాప్నగరం

ఏపీకి హోదా ఇస్తే దేశంలో అశాంతి: కిషన్‌రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా, ఏపీలో రాజకీయాలపై ఆయన మీడియాతో స్పందించారట. అంతేకాదు ఏపీకి హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటి చూసి అన్నారట. స్టేటస్‌పై అసలు మోదీకి అవగాహన లేదని... ఇప్పుడు ఇస్తే దేశంలో అశాంతి ఏర్పడుతుందన్నారట.

Samayam Telugu 18 Mar 2018, 10:56 am
ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదా, ఏపీలో రాజకీయాలపై ఆయన మీడియాతో స్పందించారట. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే హక్కు పార్టీలకు ఉందని... తీర్మానంపై జరిగే చర్చలో ప్రధాని అన్ని విషయాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారట. అంతేకాదు ఏపీకి హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటి చూసి అన్నారట. స్టేటస్‌పై అసలు మోదీకి అవగాహన లేదని... ఇప్పుడు ఇస్తే దేశంలో అశాంతి ఏర్పడుతుందన్నారట. అందుకే స్పెషల్ ప్యాకేజీ ద్వారా న్యాయం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారట.
Samayam Telugu telangana bjp leader kishan reddy comments on ap special status issue
ఏపీకి హోదా ఇస్తే దేశంలో అశాంతి: కిషన్‌రెడ్డి


చెప్పిన మాట ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని...ఆందోళనలపడాల్సిన అవసరం లేదన్నారట కిషన్. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనటం సరికాదని... కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారట. ప్రత్యేక హోదా విషయంలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారట. రాబోయే ఎన్నికల్లో జనసేన, వైసీపీలతో బీజేపీ పొత్తు అంశం ఇప్పటి వరకు పార్టీలో చర్చకు రాలేదని తెలిపారట. ఏపీలో ప్రతిపక్ష నేతగా జగన్‌ను అక్కడి చంద్రబాబు ప్రభుత్వం గుర్తించగా లేనిది... ప్రధాని మోదీ జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారట కిషన్ రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.