బీజేపీకి నాగం గుడ్ బై.. ఏ పార్టీలో చేరతారో
బీజేపీకి నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ పంపించారు. ఏ పార్టీలో చేరేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఏ నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారట.
Samayam Telugu 22 Mar 2018, 6:52 pm
బీజేపీకి నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ పంపించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నానని.. తనకు పార్టీ తరపు నుంచి ఎలాంటి సహకారం లేదని నాగం చెప్పారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఇదే విషయంపై అనుచరులు, కార్యకర్తలతో చర్చించానని.... అందుకే బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారట.
మరోవైపు నాగం కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్తో కలిసి రాహుల్ గాంధీని కూడా కలిసినట్లు వార్తలొచ్చాయి. ఈలోపే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు... జనార్థన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో జనార్థన్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ రాలేదని చర్చ నడిచింది. మరి బీజేపీకి రాజీనామా చేసిన ఆయన... ఏ పార్టీలో చేరేది ప్రకటించకపోవడం ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్లోనే చేరతారనే మరో వాదన కూడా వినిపిస్తోంది.
మరోవైపు నాగం కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్తో కలిసి రాహుల్ గాంధీని కూడా కలిసినట్లు వార్తలొచ్చాయి. ఈలోపే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు... జనార్థన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో జనార్థన్ రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ రాలేదని చర్చ నడిచింది. మరి బీజేపీకి రాజీనామా చేసిన ఆయన... ఏ పార్టీలో చేరేది ప్రకటించకపోవడం ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్లోనే చేరతారనే మరో వాదన కూడా వినిపిస్తోంది.