యాప్నగరం

టీఆర్‌ఎస్‌కు ఆ దమ్ముందా?: లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధికార టీఆర్‌ఎస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన దుయ్యబట్టారు.

Samayam Telugu 29 Jun 2018, 11:38 pm
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధికార టీఆర్‌ఎస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ చేపట్టిన 'జనచైతన్య యాత్ర' శుక్రవారం (జూన్ 29) సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రసంగించిన లక్ష్మణ్.. టీఆర్ఎస్ అరాచక పాలన నుంచి విముక్తి కోసమే యాత్ర చేపట్టామని అన్నారు. అయోధ్యలో రామాలయం అవసరం లేదని టీఆర్ఎస్ అనగలదా? అని ప్రశ్నించారు.
Samayam Telugu laxman


రామాలయం వద్దంటే శ్రీరాముడి రథచక్రాల కింద టీఆర్ఎస్ నలిగిపోతుందని వ్యాఖ్యానించారు. మత రాజకీయాలు చేసే మజ్లీస్‌తో టీఆర్ఎస్ అంటకాగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనంతా మాఫియాల రాజ్యంగా మారిపోయిందన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.