యాప్నగరం

ఢిల్లీకి సీఎం కేసీఆర్.. 4 రోజులు హస్తినలోనే?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. ఆయన నాలుగు రోజుల పాటూ ఇక్కడే ఉంటారని తెలుస్తోంది.

Samayam Telugu 27 May 2018, 7:08 pm
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. ఆయన నాలుగు రోజుల పాటూ ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటూ కేంద్రమంత్రులతో సీఎం సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రధానంగా కొత్త జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రంతో చర్చిస్తారని సమాచారం. అలాగే హైకోర్టు విభజన, రిజర్వేషన్ల పెంపుతో పాటూ.. విభజన చట్టంలోని పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించనున్నారట. చివరి వరకు ఈ పర్యటన గోప్యంగా ఉండగా.. ఆదివారం మధ్యాహ్నం క్లారిటీ ఇచ్చారు.
Samayam Telugu KCR..


ఢిల్లీకి బయల్దేరే ముందు కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో పలు కీలక తీర్మానాలు చేశారు. అందులో ముఖ్యమైనది జోన్లు. తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర తెలపగానే.. సీఎం నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఢిల్లీకి బయల్దేరారు. ఈ జోన్ల వ్యవస్థలో సవరణపై కేంద్రంతో ప్రధానంగా చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.