యాప్నగరం

త్వరలో పూర్తి ప్రణాళికతో ముందుకు.. ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్చలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మమతా బెనర్జీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 24 Dec 2018, 7:23 pm
ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కోల్‌కతాలో సోమవారం (డిసెంబర్ 24) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మమతా బెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు.
Samayam Telugu mamata


త్వరలోనే పటిష్ట, పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఫెడరర్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆదివారం నుంచే చర్చలు ప్రారంభమయ్యాయని, మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదర బాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి.. బలోపేతం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

హస్తినలో రెండు, మూడు రోజులు మకాం
కోల్‌కతా నుంచి సీఎం కేసీఆర్ నేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మంగళవారం నుంచి రెండు, మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27న ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీమాత ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఢిల్లీ బయల్దేరి వెళతారు..

ఢిల్లీలో సీఎం కేసీఆర్.. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులనూ కలవనున్నారు. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే లక్ష్యంగా భావసారూప్యత కల్గిన పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.