యాప్నగరం

ఓరుగల్లు భద్రకాళీకి స్వర్ణ కిరీటం సమర్పణ..

ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారికి సీఎం కేసీఆర్ వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు.

TNN 9 Oct 2016, 12:26 pm
వరంగల్: ఓరుగల్లు భద్రకాళీ అమ్మవారికి ఆదివారం సీఎం కేసీఆర్ వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. 11.7 కిలోల బరువుగల ఈ కిరీటం కోసం టి.సర్కార్ రూ.3.7కోట్ల రూపాయలు వెచ్చించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అంతకుముందు అమ్మవారి ఆలయానికి వచ్చిన కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా ఆలయంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణకిరీటం సమర్పణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు ప్రతినిధులు, ఆలయ అధికారులు హాజరయ్యారు.
Samayam Telugu telangana cm kcr offering gold crown to bhadrakali
ఓరుగల్లు భద్రకాళీకి స్వర్ణ కిరీటం సమర్పణ..




అమ్మవారి జన్మనక్షత్రం రోజును పురస్కరించుకొని భద్రకాళీమాతను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల తాడికితో ఆలయం కిటకిడలాడుతోంది. సీఎం కేసీఆర్ రాకతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.