యాప్నగరం

‘డబుల్ బెడ్‌రూమ్‌’లను ప్రారంభించిన సీఎం

సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు జరిగాయి.

Samayam Telugu 23 Dec 2016, 10:22 am
సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. మొత్తం 600 ఇండ్లలో వేదమంత్రోచ్ఛరణల మధ్య గృహప్రవేశాలు జరిగాయి. ఇరు గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సుమూహుర్తం 7.53 గంటలకు వేద మంత్రోచ్చారణ నడుమ గ్రామస్తులు గృహప్రవేశం చేశారు.
Samayam Telugu telangana cm kcr performs house warm of double bed rooms for poor
‘డబుల్ బెడ్‌రూమ్‌’లను ప్రారంభించిన సీఎం



క్యాష్‌లెస్ గ్రామాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలను సీఎం కేసీఆర్ నేడు నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఓ గొప్ప ముందడుగన్నారు. ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణంలో ముందుకుపోదామని సీఎం పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలన్న ఆయన గ్రామాలు స్వయం సహాయ గ్రామాలుగా నిలవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఉండాలన్నారు.

రెండు గ్రామాల పరిధిలో 600 పేద కుటుంబాలకు ఉచితంగా ప్రభుత్వమే నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. ఒక్కొక్క ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తారు. వెయ్యి మందికి సరిపడా కల్యాణ మండపం, భోజనశాల నిర్మించారు. ప్రతి కుటుంబ ఉపాధికి రెండు గేదెలు, పది దేశీయ కోళ్ల పంపిణీ జరుగుతోంది. హరితహారం కింద ప్రతి ఇంటికి ఐదు మొక్కల పంపిణీ చేశారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.