యాప్నగరం

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగించుకొని సోమవారం (మే 29) రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర హోంశాఖ మంత్రిరాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు.

Samayam Telugu 29 May 2018, 1:23 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగించుకొని సోమవారం (మే 29) రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. కొత్త జోనల్‌ విధానానికి రాష్ట్రపతి ఆమోదం కోసం వినతి పత్రం అందజేశారు. హైకోర్టు విభజన అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు మరికొన్ని కీలక అంశాలను కూడా రాజ్‌నాథ్‌తో చర్చించారు.
Samayam Telugu kcr


నాలుగురోజుల ఢిల్లీ పర్యటనకు ఆదివారం (మే 28) బయలు దేరారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ని, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కేసీఆర్ కలవాల్సి ఉంది. కొత్త జోనల్ విధానం గురించి మోదీతో చర్చించాలని అనుకున్నారు. మోదీ విదేశీ పర్యటన కారణంగానే కేసీఆర్‌‌కు అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.