యాప్నగరం

సీమకు బయలుదేరిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం రాయలసీమకు బయలుదేరి వెళ్లారు.

TNN 1 Oct 2017, 11:34 am
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం రాయలసీమకు బయలుదేరి వెళ్లారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో నేడు జరగనున్న ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం వివాహానికి సీఎం హాజరుకానున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కేసీఆర్.. పుట్టపర్తి విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెంకటాపురం చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
Samayam Telugu telangana cm kcr to attend paritala srirams marriage function today
సీమకు బయలుదేరిన సీఎం కేసీఆర్


తమ కుమారుడి పెళ్లికి రావాలంటూ పరిటాల సునీత కొద్దిరోజుల క్రితం స్వయంగా కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. సునీత ఆహ్వానంతో పరిటాల శ్రీరాం వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతపురం వెళ్లారు. మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సైతం పరిటాల శ్రీరాం వివాహానికి హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే పెళ్లివేడుకలో కలుసుకోనుండటం ఆసక్తికరం. కాగా, ఈ పెళ్లి రెండు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేస్తున్నారు. గవర్నర్ నరసింహన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు.

సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం ఏబీఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఆళం వెంకటరమణ, సుశీలమ్మ కుమార్తె ఆళం జ్ఞానవేనిని పరిటాల శ్రీరాం వివాహం చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిటాల రవి అభిమానులు, పరిటాల కుటుంబంతో అనుబంధం ఉన్న వారందరినీ సునీత పెళ్లికి ఆహ్వానించారు. అందులో భాగంగా ఆమె రెండు వారాల క్రితం హైదరాబాద్ వచ్చి పలువురు ప్రముఖులకు ఆహ్వానపత్రికలు అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.