తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు పార్థివదేహాన్ని చూసి సీఎం కేసీఆర్.. తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. హబ్సిగూడలోని విద్యాసాగర్ రావు నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా.. సాగునీటి రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కేసీఆర్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నీటి పారుదల రంగంలో అపార అనుభవం ఉన్న విద్యాసాగర్ రావుతో.. కేసీఆర్ ఉద్యమ సమయం నుంచే అత్యంత సన్నిహితంగా మెలిగిన విషయం తెలిసిందే.
విద్యాసాగర్ రావు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే.. కేసీఆర్ ఆయణ్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఇరిగేషన్)గా నియమించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, నీటి వనరులపై వివక్షను ఆయన సమర్థంగా ఎత్తిచూపగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణకు సంబంధించిన నీటి కేటాయింపుల కోసం తీవ్రంగా పోరాడారు. మిషన్ కాకతీయ పథకానికి సంబంధించి కూడా కీలక సూచనలు అందించారు.
ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్న కేసీఆర్.. ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, ఎంపీ కవిత, మంత్రులు నాయినీ, పోచారం తదితరులు ఉన్నారు.
విద్యాసాగర్ రావు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే.. కేసీఆర్ ఆయణ్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఇరిగేషన్)గా నియమించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, నీటి వనరులపై వివక్షను ఆయన సమర్థంగా ఎత్తిచూపగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణకు సంబంధించిన నీటి కేటాయింపుల కోసం తీవ్రంగా పోరాడారు. మిషన్ కాకతీయ పథకానికి సంబంధించి కూడా కీలక సూచనలు అందించారు.
ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్న కేసీఆర్.. ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, ఎంపీ కవిత, మంత్రులు నాయినీ, పోచారం తదితరులు ఉన్నారు.