యాప్నగరం

‘థర్డ్ ఫ్రంట్’కు తొలి అడుగు: కోల్‌కతాకు కేసీఆర్!

ఒక వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానంతో పోరాడుతుంటే, మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటుకు దూకుడు పెంచారు.

Samayam Telugu 17 Mar 2018, 7:26 pm
జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసకుంటున్నాయి. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానంతో పోరాడుతుంటే, మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటుకు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా కేసీఆర్ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసేందుకు కోల్‌కతా వెళ్తున్నారు.
Samayam Telugu telangana cm kcr will meet mamatha in kolkata in march 19th
‘థర్డ్ ఫ్రంట్’కు తొలి అడుగు: కోల్‌కతాకు కేసీఆర్!


జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించగానే తృణమూల్ అధినేత్రి మమతా ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆమెను కలిసి థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సైతం ఎన్డీయే నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. బీజేపీని వ్యతిరేకించే పార్టీల సంఖ్య క్రమేనా పెరిగింది.

అయితే, ఈ ఫ్రంట్‌లో టీడీపీ చేరుతుందా లేదా అనే విషయం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంపై వాడీ వేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు తన వైఖరిని వెల్లడించే అవకాశాలు లేవు. ఈ లోగానే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను వీలైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ కలుపుకుని ప్రత్యామ్నయ శక్తిగా ఎదగాలనే ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.