యాప్నగరం

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన టీ కాంగ్రెస్

ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. కేసీఆర్ సర్కారు తమ ఎమ్మెల్యేలను లాక్కుంటున్న కారణంగానే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు

Samayam Telugu 11 Mar 2019, 2:16 pm
ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కోటాలో రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.
Samayam Telugu congress


ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోంది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి తూట్లు పొడుస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడగానే టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు’

‘శాసనసభలో మాకున్న బలం ప్రకారం ఓ ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ వికృత రాజకీయాలకు పాల్పడి మా ఎమ్మెల్యేలను లాక్కున్నారు. నాలుగు స్థానాలు మాత్రమే గెలిచే ఛాన్స్ ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి ఐదో స్థానానికి నామినేషన్ వేయడం దారుణం. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని ఉత్తమ్ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.