యాప్నగరం

ఉత్తమ్‌పై వ్యాఖ్యలు.. గజ్జెల కాంతంకు షోకాజ్ నోటీసులు

ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన గజ్జెల కాంతం. షోకాజ్ నోటీసులు పంపిన పార్టీ క్రమశిక్షణ సంఘం.

Samayam Telugu 14 Dec 2018, 6:35 pm
తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతంకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు శనివారంలోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణా సంఘం నోటీసుల్లో పేర్కొన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్యలెందుకు తీసుకోకూడదని కూడా ప్రశ్నించారు.
Samayam Telugu gajjala kantham


ఉత్తమ్‌పై నిప్పులు చెరిగిన కాంతం
టీ-పీసీపీ చీఫ్ ఉత్తమ్‌పై గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కారణమని మండిపడ్డారు. తన స్వార్థప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హౌసింగ్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తమ్‌ కోవర్టుగా మారారని.. హై కమాండ్‌ను తప్పుదోవ పట్టించారన్నారు. పార్టీ గెలవకపోతే తప్పుకుంటానన్న ఆయన.. ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే ఆయన అధ్యక్ష పదవి నించి తప్పుకొని.. బీసీ, లేని పక్షంలో ఎస్సీ నేతకు ఆ బాధ్యతలు అప్పగించాలన్నారు.

రాహుల్ గాంధీ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తుంటే.. ఉత్తమ్ మాత్రం పార్టీని నాశనం చేశారన్నారు. ఉత్తమ్ గృణనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి.. అవి బయటపెట్టకుండా ఉండటానికి టీఆర్ఎస్‌తో లాలూచీపడ్డారని మండిపడ్డారు. మై హోమ్ రామేశ్వరరావుతో ఉత్తమ్ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించడం, పొత్తు విషయంలో అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.