యాప్నగరం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి.. కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సంకేతాలతో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ పేరుతో సమరానికి సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ కూడా ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉంది. మంగళవారం పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.

Samayam Telugu 28 Aug 2018, 1:51 pm
తెలంగాణలో ముందస్తు ఎన్నికల సంకేతాలతో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ పేరుతో సమరానికి సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ కూడా ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉంది. మంగళవారం పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డితో పాటూ ముఖ్య నేతలు హాజరయ్యారు.
Samayam Telugu Gandhi Bhavan


ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఖరారైతే.. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి.. ప్రజలకు ఎలా చేరువ కావాలనే అంశాలపై దృష్టిపెట్టారట. ముందస్తుపై పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.