యాప్నగరం

అమ్మో ఆరో తారీఖు... కాంగ్రెస్‌‌లో కలవరం?

తెలంగాణలో బలపడాలని చూస్తోన్న బీజేపీ ఫస్ట్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలకు ఎర వేస్తోందని సమాాచారం. ఆపరేషన్ కమలంలో భాగంగా హస్తం పార్టీకి చెందిన ముఖ్య నేతలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 1 Jul 2019, 8:44 pm
వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోన్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదగాలని భావిస్తోన్న కమలం పార్టీ.. ఇందుకోసం కాంగ్రెస్‌ను బలహీనం చేయాలని, ఆ పార్టీ నుంచి సాధ్యమైనంత మంది కీలక నేతలను పార్టీలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ కమలంలో భాగంగా.. చాలా మంది కాంగ్రెస్ నేతలతోపాటు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం.
Samayam Telugu congress symbol


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు నేతలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యారని సమాచారం. గతంలో బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేసిన ఓ మహిళా నేత, గతంలో హైదరాబాద్‌లోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి గత రెండు పర్యాయాలు ఓడిన కీలక నేత.. బీజేపీలో చేరబోతున్నారని టాక్. ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.

బీజేపీ సభ్యత్వ నమోదు కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జూలై 6న హైదరాబాద్‌ రానున్నారు. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చేరికల వ్యవహారం ఇక్కడితో ఆగదని.. ఇక నుంచి ప్రతి నెలా ఇద్దరు చొప్పున కేంద్ర మంత్రులు తెలంగాణ వస్తారని, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక ఫోకస్ పెడతారని తెలుస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని.. బహిరంగ సభ నిర్వహణ ద్వారా యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.