తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరుతో బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో ఈ సభ నిర్వహిస్తామని ఆయన గురువారం మీడియాకు వివరించారు.
నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ప్రజా గర్జన సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. కేసీఆర్ పాలన తెలంగాణలో నియంతృత్వం ట్రేడ్మార్క్ లా మారిందని ఉత్తమ్ విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసిన ఉత్తమ్.. బీజేపీ నేతలే తమ పార్టీలో చేరనున్నట్లు జోస్యం చెప్పారు.
నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ప్రజా గర్జన సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. కేసీఆర్ పాలన తెలంగాణలో నియంతృత్వం ట్రేడ్మార్క్ లా మారిందని ఉత్తమ్ విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసిన ఉత్తమ్.. బీజేపీ నేతలే తమ పార్టీలో చేరనున్నట్లు జోస్యం చెప్పారు.