యాప్నగరం

గవర్నర్‌తో సీఎస్, అసెంబ్లీ కార్యదర్శి భేటీ.. ఆసక్తిరేపుతున్న పరిణామాలు

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గవర్నర్‌ను సీఎస్, అసెంబ్లీ సెక్రటరీలు కలవడం ప్రాధాన్యత ఏర్పడింది. ముందస్తు సంకేతాలతో ఉన్నతాధికారుల వరుస భేటీలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Samayam Telugu 4 Sep 2018, 4:03 pm
తెలంగాణలో మళ్లీ ముందస్తు మూడ్ కనిపిస్తోంది. మంగళవారం జరిగిన పరిణామాలు చూస్తే.. మళ్లీ ముందస్తు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ.. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సెక్రటేరియెట్‌లో సమావేశమయ్యారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో కూడా భేటీ అయ్యారు. దాదాపు అరగంటకుపైగా ఈ సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎస్ జోషి-రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌తో సమావేశం అయ్యారు.
Samayam Telugu Governor.


ప్రభుత్వంలో కీలకమైన ఉన్నతాధికారుల వరుస భేటీలతో.. మరోసారి ముందస్తు, అసెంబ్లీ రద్దు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ అంశాలపై చర్చించేందుకే అధికారులు గవర్నర్‌ను కలిశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎస్ రాజభవన్‌కు వెళ్లడం మామూలే.. కాని అసెంబ్లీ కార్యదర్శి కూడా వెళ్లడంతో ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు ఈ భేటీలో రాజ్యాంగపరమైన అంశాలపై చర్చించారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎస్ ఎన్నికల ప్రధాన అధికారిని కలవడం కూడా ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

మరోవైపు తెలంగాణ కేబినెట్ భేటీ కూడా రెండు మూడు రోజుల్లో ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రగతి నివేదన సభలానే.. హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావులకు ఆ బాధ్యతలు అప్పగించారట. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ మరింత ఆసక్తి రేపుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.