యాప్నగరం

రేవంత్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆయనే

తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసిన రోజే తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. . తాము ఎందుకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు

Samayam Telugu 6 Sep 2018, 4:50 pm
తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసిన రోజే తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. . తాము ఎందుకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. శాసనసభ రద్దైన అర గంటలోనే తెలంగాణలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరతీశారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నాలుగు స్థానాలతోపాటు మరో పది నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక తెలంగాణలో అత్యంత ప్రధానమైన నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో రేవంత్‌కు మంచి పట్టు ఉంది. గతేడాది టీడీపీని వీడిన రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. అప్పటి నుంచే అధికార టీఆర్ఎస్ ఈ స్థానంపై దృష్టి సారించింది. రేవంత్‌ను ఎదుర్కొనేందుకు అనేక వ్యూహాలు రచించింది.
Samayam Telugu రేవంత్ రెడ్డి


రేవంత్‌‌ను ఎలాగైనా ఓడించాలనే సంకల్పంతో ధీటైన అభ్యర్థి కోసం అన్వేషించిన కేసీఆర్ చివరకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడివైపే మొగ్గుచూపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ టిక్కెట్‌ను కేటాయించింది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తెరాస, రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తుంది. అంతేకాదు అక్కడ తమ విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమాతో ముందుకెళ్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.