యాప్నగరం

తెలంగాణలో ఎక్స్‌ప్రెస్ హైవేలు: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రహదారులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి ఆరోపించారు.

Samayam Telugu 23 Dec 2016, 12:49 pm
కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రహదారులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో తాను, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పాదయాత్ర చేశానని, అప్పుడే ఆయన ఇక్కడి రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి అసెంబ్లీలో గుర్తు చేశారు. గతప్రభుత్వాల పరిపాలనలో ఏ రహదారి చూసినా ప్రమాదాలమయం ఆయన విమర్శించారు.
Samayam Telugu telangana gets express highways soon bjp mla kishan reddy
తెలంగాణలో ఎక్స్‌ప్రెస్ హైవేలు: కిషన్ రెడ్డి


తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరణ, అభివృద్ధికి కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు త్వరలో చేరుకునేందుకు త్వరలో కేంద్రం ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మించబోతుందని, ఆప్రాజెక్టుకు ఓ కంపెనీకి అప్పగించినట్లు ఆయన చెప్పారు. జాతీయ రహదారుల కల్పన, విస్తరణ వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డ్రైపోర్టుల నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు.

హైదరాబాద్ లోని రహదారులు, జాతీయ రహదారులలో జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎంఐఎం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించినందుకు టీడీపీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఏర్పడిన కొత్త జిల్లాలు, మండలల్లో రెండు లైన్లు రహదారులు నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రోడ్ల వెడల్పుపై దృష్టి పెట్టడంతో పాటు రహదారులపై బ్రిడ్జిలను కూడా వెడల్పు చేయాలని ఆయన సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.