చిన్న, చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసుకుంటోంది యువత. టీచర్ తిట్టాడని, తల్లిదండ్రులు మందలించారని... ఇలా కారణం ఏదైనా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. వికారాబాద్ జిల్లాలోనూ అదే జరిగింది. తల్లిదండ్రులు మొబైల్ కొనివ్వలేదనే మనస్తాపంతో యువతి ప్రాణాలు తీసుకోబోయింది. తల్లి ముందే కిరోసిన్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మాసన్పల్లికి చెందిన నవీన అనే యువతి హైదరాబాద్లోని ఓ ఇంట్లో పని చేస్తోంది. అయితే బాబాయి కొడుకు పెళ్లి ఉండటంతో సొంత ఊరికి వచ్చింది.
నాలుగు రోజుల క్రితం నవీన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని తుల్జాపూర్ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో యువతి తన మొబైల్ను పోగొట్టుకుంది. ఫోన్ పోవడంతో ఆమె దిగాలుగా ఉండటాన్ని గమనించిన తల్లి... కొత్తది కొనిస్తానని చెప్పింది. తిరిగి ఇంటికి రాగానే ఆమె మొబైల్ కొనివ్వాలని తల్లిని అడిగింది. ఇంట్లో పూజ ఉందని... ఒక్కరోజు ఆగమని కూతురికి సర్థిచెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది.
కూతురు కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే మంటలార్పేశారు. అప్పటికే ఆమె తల, మొహం, ఛాతి భాగాలు కాలిపోయాయి. ఆమెను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా... అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.
నాలుగు రోజుల క్రితం నవీన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని తుల్జాపూర్ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో యువతి తన మొబైల్ను పోగొట్టుకుంది. ఫోన్ పోవడంతో ఆమె దిగాలుగా ఉండటాన్ని గమనించిన తల్లి... కొత్తది కొనిస్తానని చెప్పింది. తిరిగి ఇంటికి రాగానే ఆమె మొబైల్ కొనివ్వాలని తల్లిని అడిగింది. ఇంట్లో పూజ ఉందని... ఒక్కరోజు ఆగమని కూతురికి సర్థిచెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది.
కూతురు కేకలు విన్న తల్లిదండ్రులు వెంటనే మంటలార్పేశారు. అప్పటికే ఆమె తల, మొహం, ఛాతి భాగాలు కాలిపోయాయి. ఆమెను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా... అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.