యాప్నగరం

గొర్రెలు అయిపోయాయ్.. ఇక బర్రెల వంతు

ఇప్పటి వరకూ గొర్రెలను పంపణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి గేదెలను పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులకు గేదెలు అందించే పథకాన్ని సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.

TNN 9 Feb 2018, 1:23 pm
ఇప్పటి వరకూ గొర్రెలను పంపణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి గేదెలను పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులకు గేదెలు అందించే పథకాన్ని సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో 2.17 లక్షల పాడి సహకార సంఘాలకు గేదెలను సబ్సిడీకి అందించనున్నారు. సీఎం ఆమోద ముద్ర వేయడమే ఆలస్యం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం రూ. 2 వేల కోట్లు అవసరమని పశుసంవర్థక శాఖ అంచనా వేసింది.
Samayam Telugu telangana government to give buffaloes at 50 per cent subsidy to farmers
గొర్రెలు అయిపోయాయ్.. ఇక బర్రెల వంతు


పాడి సహకార సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ సభ్యులకు 75 శాతం సబ్సిడీకి గేదెలను అందజేస్తారు. మిగతా పాడి రైతులకు 50 శాతం సబ్సిడీకి అందజేస్తారు. ఒక్కో గేదెకు రూ.60 వేల నుంచి రూ. 90 వేల వరకు వెచ్చించి హర్యానా, పంజాబ్‌ల నుంచి కొనుగోలు చేయనున్నారు.

ఇక్కడి నాటు గేదెలు రోజుకు నాలుగైదు లీటర్ల పాలు మాత్రమే ఇస్తుండగా.. హర్యానా, పంజాబ్ గేదెలు రోజుకు పది లీటర్ల పాలిస్తాయి. ఎక్కువ పాలివ్వడం వల్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే యాదవ, కురుమ సామాజిక వర్గాలకు చెందిన వారికి 50 లక్షల గొర్లను పంపిణీ చేశారు.

రాష్ట్రంలో రోజుకు కోటి లీటర్ల పాలు అవసరం కాగా, ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రాలతోపాటు గుజరాత్ నుంచి కూడా రోజు పాలు తెప్పిస్తున్నారు. గేదెల పంపిణీ వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.