యాప్నగరం

పిడుగుపాటుకు చనిపోతే రూ.6 లక్షలు!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వయసుతో సంబంధం లేకుండా పిడుగుపాటుకు మరణించిన ఎవ్వరికైనా సరై వారికి తక్షణమే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.

Samayam Telugu 19 Jul 2018, 7:41 pm
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వయసుతో సంబంధం లేకుండా పిడుగుపాటుకు మరణించిన ఎవ్వరికైనా తక్షణమే రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం (జులై 19) ఉత్తర్వులు కూడా జారీచేసింది. గతంలో పిడుగుపాటుకు మరణించినవారికి 'ఆపద్భందు' పథకం కింద రూ.50వేలు పరిహారమే ఇచ్చేది. అయితే తాజాగా రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది.
Samayam Telugu పిడుగుపాటు


'రైతు బీమా' పేరుతో 18-59 సంవత్సరాల రైతులు చనిపోతే రూ.5 లక్షల బీమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుంచి బీమాకు సంబంధించిన బాండ్లను రైతులకు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు సరైన కారణం చెప్పి దరఖాస్తు చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.